నిజంనిప్పులాంటిది

Apr 20 2024, 07:46

చెన్నై ని చిత్తు చేసిన లక్నో

ఐపీఎల్ 2024లో భాగంగా హోం గ్రౌండ్‌లో నిన్న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ విజయం సాధించింది.

చెన్నై నిర్దేశించిన 177 పరుగుల ఛేదనలో లక్నో ఓపెనర్లు చెలరేగిపోయారు. దీంతో సీఎస్‌కేపై జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొం దింది.

సొంత గడ్డ పై CSK ను త‌క్కువ‌కే క‌ట్ట‌డి చేసిన ల‌క్నోకు ఓపెన‌ర్లు శుభా రంభ‌మిచ్చారు. క్వింట‌న్ డికాక్‌(54), కెప్టెన్ కేఎల్ రాహుల్(82) చ‌రో హాఫ్ సెంచ‌రీతో చెన్నై బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డుతున్నారు.

ఇక ఆ త‌రువాత వ‌చ్చిన నికోలస్ పూరన్ 23,నాటౌట్ మెప్పించాడు. దాంతో 19 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసిన లక్నో… 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఇక చెన్నై బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహమాన్, మతీషా పతిరనా చెరో వికెట్ దక్కించుకున్నారు.

నిజంనిప్పులాంటిది

Apr 20 2024, 07:45

ఎగ్జిట్ పోల్ జూన్ 1 వరకు రద్దు?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు నిన్ను ప్రారంభం అయ్యా యి. ఈసారి లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహి స్తున్నారు.

మొత్తం 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అదే సమయంలో 12 రాష్ట్రాల్లో 25 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.

నిన్ను దేశంలో తొలి దశ పోలింగ్ జరిగింది.ఈ తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం నేడు ఓ నోటిఫికేషన్ జారీ చేసింది.

దేశంలో ఎన్నికలు జరుగు తున్నందున ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం విధిస్తున్నట్టు తెలిపింది. ఏప్రిల్ 19వ తేదీ ఉదయం 7 గంటల నుంచి జూన్ 1వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించరాదని ఈసీ స్పష్టం చేసింది.

ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఏ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ ఎన్నికల ఫలితాలు, సర్వేలు, ఒపీని యన్ పోల్స్ ప్రదర్శించరా దని ఈసీ పేర్కొంది.

నిజంనిప్పులాంటిది

Apr 19 2024, 07:54

విధుల్లో నిర్లక్ష్యం ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్‌

హైదరాబాద్ మల్టీజోన్‌ -1 పరిధిలో విధుల్లో అలసత్వం వహించిన ఆరుగురు పోలీసు అధికారులను ఐజీ ఏవీ రంగనాథ్‌ గురువారం సాయంత్రం సస్పెండ్‌ చేశారు.

సస్పెండ్‌ అయిన వారిలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలు, హెడ్‌ కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌ ఉన్నారు. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్ పరిధిలోని ప్రజా భవన్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన

బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రాహిల్‌ను తప్పించేందుకే పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌తో సంప్రదింపులు జరిపినట్టుగా హైదరాబాద్‌ సీపీ విచారణలో తేలడంతో అప్పటి బోధన్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రేమ్‌ కుమార్‌ను సస్పెండ్‌ చేశారు.

మద్యం సేవించి పోలీస్‌స్టే షన్‌కు వచ్చి స్టేషన్‌ సిబ్బం దిని ఇబ్బందులకుగురి చేసిన నిజామాబాద్‌ జిల్లా సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.రమేశ్‌ను సస్పెండ్‌ చేశారు.

జగిత్యాల జిల్లా సారంగా పూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన గంజాయి కేసులో అలసత్వంగా వ్యవహారిం చిన ఎస్సైలు మనోహర్ రావు, తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ బి. రవీందర్ రెడ్డి, కానిస్టేబుల్ టి.నరేం దర్ లను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్- 1 ఐజీ రంగ నాథ్‌ ఉత్తర్వులు జారీ చేశారు...

నిజంనిప్పులాంటిది

Apr 19 2024, 07:52

ముంబై ముందు తలవంచిన పంజాబ్

ఐపీఎల్ 2024లో భాగంగా నేడు జరిగిన ఉత్కంఠ పోరులో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది.

ముల్లన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 పరుగుల తేడాతో గెలుపొందింది. 193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ జట్టు చివరి ఓవర్ వరకు పోరాడింది.

ఇక 19.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. ఇక ఈ విజయంతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న ముంబై 7వ స్థానానికి చేరుకుంది.

అయితే, పంజాబ్ కింగ్స్ టాపార్డర్ పూర్తిగా విఫల మైనప్పటికీ… మిడిలార్డర్ బ్యాటర్లు శ‌శాంక్ సింగ్, అశుతోష్ శర్మ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు.

అశుతోష్ శర్మ (61; 28 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. శ‌శాంక్ సింగ్ (41; 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) రాణించాడు. హర్‌ప్రీత్ బ్రార్ (21) పరువాలేదరనిపించాడు.

ఇక ముంబై బౌల‌ర్ల‌లో బుమ్రా, గెరాల్డ్ కోయెట్జీ చెరో మూడు వికెట్లు పడగొట్ట గా… శ్రేయాస్ గోపాల్, ఆకాశ్ మ‌ధ్వాల్, హార్దిక్ పాండ్యలు త‌లా ఓ వికెట్ దక్కించుకున్నారు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు నష్టానికి 192 ప‌రుగులు చేసింది. ముంబై బ్యాట‌ర్ల‌లో సూర్యకుమార్ యాదవ్ (78; 53 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ చేయ‌గా..

తిల‌క్ వ‌ర్మ (34 నాటౌట్; 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), రోహిత్ శ‌ర్మ (36; 25 బంతుల్లో 2ఫోర్లు, 3సిక్స‌ర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు.

పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీశాడు. సామ్ కరణ్ రెండు వికెట్లు తీయగా కగిసో రబడా ఓ వికెట్ పడగొట్టాడు...

నిజంనిప్పులాంటిది

Apr 19 2024, 07:50

ఏసీబీకి చిక్కిన టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్ వెంకటరమణి

ఓ భూమిని ఎల్‌ఆర్‌ఎస్‌ చేయడం కోసం టీపీఎస్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

ఈ ఘటన భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పాల్వంచ మున్సిపల్‌ కార్యాలయంలో గురువారం చోటు చేసుకుం ది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

పాల్వంచ మున్సిపల్‌ కార్యా లయంలో టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ టీపీఎస్‌ గాపని చేస్తున్న వెంకటర మణి, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి ప్రసన్నకుమార్‌ ఓ భూమి విషయంలో ఎల్‌ఆర్‌ ఎస్‌ చేయడం కోసం ప్లాట్‌కు రూ.10 వేల చొప్పున మూడు ప్లాట్లకు రూ.30 వేలు డిమాండ్‌ చేశారు.

తాను రూ.30 వేలు ఇవ్వలేనని, ప్లాట్‌కు రూ.5 వేల చొప్పున.. రూ.15 వేలు ఇస్తామని పాల్వంచకు చెందిన భూ యజమాని కాంపెల్లి కనకేష్‌ సదరు ఉద్యోగులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

తర్వాత ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు వివరించిన కనకేష్‌.. వారి సూచన మేరకు గురువారం టీపీఎస్‌కు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగికి రూ.15 వేలు లంచం ఇస్తుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఏసీబీ డీఎస్పీ రమేశ్‌ వెల్లడించారు.

ఎవరైనా లంచం అడిగితే 1064 టోల్‌ ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయొ చ్చన్నారు. ఈ విషయంలో ఎవరూ భయపడవద్దని, ఫిర్యాదుదారులకు అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు...

నిజంనిప్పులాంటిది

Apr 18 2024, 09:04

నేడు భద్రాద్రిలో శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవం

భద్రాద్రి లో శ్రీరామనవమి శోభ సంతరించుకుంది. భద్రాచల పుణ్యక్షేత్రంలో బుధవారం శ్రీసీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. గురువారం శ్రీ రామ మహా పట్టాభిషేక మహోత్సవం జరగనుంది.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవ ర్నర్ రాధాకృష్ణన్ దంపతు లు హాజరు కానున్నారు. మిథిలా కళ్యాణ మండ పంలో ఈరోజు ఉదయం 10.30 గంటల నుంచి 12.30 వరకు పట్టాభిషేక మహోత్సవం జరగనుంది.

కాగా బుధవారం శ్రీసీతారా ముల కళ్యాణోత్సవం కన్ను ల పండువగా జరిగింది. కల్యాణ వేదికపై వధూవ రులుగా జానకిరాములు ఆసీనులయ్యారు. వరుడి తండ్రి దశరథ మహారాజు తరఫున ఒకటి, వధువు తండ్రి జనక మహారాజు తరఫున ఇంకోటి.. భక్తుల తరఫున మరొకటి.. ఇలా రామదాసు చేయించిన ‘‘మూడు సూత్రాల మంగళ సూత్రం’’ వేదమంత్రోచ్ఛా రణల నడుమ సీతమ్మవారి మెడలో పడింది.

అణిముత్యములు తలం బ్రాలయ్యాయి. ఆ తలంబ్రా లు నీలమేఘశ్యాముడైన రాముడు తన దోసిట తీసుకోగానే నీలపురాశిగా మిలమిలలాడాయి! సీతమ్మ దోసిట్లోకి చేరగానే కెంపులై మెరిశాయి! జానకిరాముల శిరమున వెలసిన ఆ తలబంబ్రాల దెంత భాగ్యం.. ఆ జగత్క ల్యాణ ఘట్టాన్ని కనులారా వీక్షించిన భక్తకోటిదెంత పుణ్యం! ఆ భక్తి భావన మనసునిండా ఉప్పొంగగా భక్తజనమంతా అంతా జై శ్రీరామ్‌ అంటూ నినాదాలు చేశారు.

ఇలా బుధవారం శ్రీరామ నవమి సందర్భంగా భద్రా చలం క్షేత్రంలో సీతారాముల కల్యాణం నేత్రపర్వంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరుపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పిం చారు.

సర్కారు తరఫున పట్టువ స్త్రాలు, ముత్యాల తలం బ్రాలను సమర్పించిన తొలి సీఎస్‌ శాంతికుమారి కావ డం గమనార్హం. గురువారం రాముచంద్రమూర్తికి మహాప ట్టాభిషేకం నిర్వహించను న్నారు. మిథిలా స్టేడియం లోనే జరిగే ఈ కార్యక్రమం సందర్భంగా స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున గవర్నర్‌ రాధాకృష్ణన్‌ పట్టువస్త్రాలను సమర్పిం చనున్నారు..

నిజంనిప్పులాంటిది

Apr 18 2024, 07:21

చిత్తుగా చిత్తుగా ఓడిన గుజరాత్‌

నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్‌ను ఢిల్లీ మట్టికరి పించింది. ముందుగా బౌలిం గ్‌ ధాటితో కుప్పకూల్చిన ఢిల్లీ.. ఆ తర్వాత అవలీ లగా టార్గెట్‌ను చేధించింది. 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు ఆరంభం నుంచే ఢిల్లీ షాకులు ఇస్తూ వచ్చింది. ఢిల్లీ బౌలర్ల ధాటికి గుజరాత్‌ బ్యాటర్లు చతికి లబడ్డారు. ఎవ్వరూ కూడా చెప్పుకోదగ్గ పరుగులు చేయలేకపోయారు.

ఒక్క రషీద్‌ ఖాన్‌ (31) మాత్రమే జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్‌ అందించా డు. కానీ అప్పటికే జట్టు మొత్తం విఫలం కావడంతో 89 పరుగుల వద్దనే గుజ రాత్‌ ఆగిపోయింది. దీంతో 90 పరుగుల అత్యల్ప టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ బ్యాటర్లు మధ్యలో తడబడినప్పటికీ 8.5 ఓవర్లలోనే అవలీలగానే టార్గెట్‌ను చేధించారు.

గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో రెండో ఓవర్‌లోనే ఓపెనర్‌ శుభ్‌ మన్‌ గిల్‌ (8) ఔటవ్వగా.. నాలుగో ఓవర్‌లో ఐదో బంతికి మరో ఓపెనర్‌ వృద్ధిమాన్‌ సాహా (2) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఐదో ఓవర్‌లో మొదటి బంతికి సాయి సుదర్శన్‌ (12) రనౌటయ్యాడు.

ఆ తర్వాత వచ్చిన డేవిడ్‌ మిల్డర్‌ (2) కూడా రిషబ్‌ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. తొమ్మిదో ఓవర్‌లో అభినవ్‌ మనోహర్‌ (8), షారుక్‌ ఖాన్ (0)ను రిషబ్‌ పంత్‌ స్టంపౌట్‌ చేశాడు. 12వ ఓవర్‌లో రెండో బంతికి రాహుల్‌ తెవాటియా (10) ఎల్బీడ బ్ల్యూగా వెనుది రిగాడు.

15వ ఓవర్‌లో చివరి బంతికి మోహిత్‌ శర్మ (2).. సుమిత్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. 18వ ఓవర్‌లో మొదటి బంతికే రషీద్‌ ఖాన్ (31) పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నూర్‌ అహ్మద్‌, స్పెన్సర్‌ జాన్సన్‌ వెంటవెంటనే పెవిలియన్‌కు చేరారు. ఫలితంగా 17.3 ఓవర్ల వద్ద 89 పరుగులకే గుజరాత్‌ ఆలౌట్‌ అయ్యింది.

అత్యల్ప టార్గెట్‌ను చేధిం చేందుకు క్రీజులోకి ముందు గా వచ్చిన జెక్‌ ఫ్రేజర్‌ (20) దూకుడుగా ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టాడు. అతనికి పృథ్వీ షా ( 7) తోడయ్యా డు. కానీ జెక్‌ ఫ్రేజర్‌ దూకు డుకు స్పెన్సర్‌ జాన్సన్‌ చెక్‌ పెట్టాడు. ఫ్రేజర్‌ ఔటయిన కాసేపటికే పృథ్వీ షా కూడా పెవిలియన్‌కు పంపించారు.

ఆ తర్వాత కాసేపటికే గుజరాత్‌ బౌలర్లు అభిషేక్‌ పొరెల్‌ (15 ), షై హోప్‌ (19) వికెట్లను తీసి ఢిల్లీని టెన్షన్‌ పెట్టాలని అనుకున్నారు. కానీ రిషబ్‌ పంత్‌(16), సుమిత్‌ కుమార్‌ (9) నిలకడగా ఆడుతూ టార్గెట్‌ను చేధించారు...

నిజంనిప్పులాంటిది

Apr 18 2024, 07:16

భారతీయుడు అడుగుపెట్టే వరకు జాబిల్లి యాత్రలు: ఇస్రో చీఫ్

అహ్మదాబాద్‌: అందని ద్రాక్షగా ఉన్న చందమామ దక్షిణ ధ్రువంపైకి విజయవంతంగా ల్యాండర్‌ను దింపి అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్రను లిఖించింది భారత్‌. ఈ ప్రయోగం గురించి తాజాగా దేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్ (Somanath) మరోసారి స్పందించారు..

భవిష్యత్తుల్లోనూ మరిన్ని జాబిల్లి యాత్రలు (Lunar Missions) చేపడతామని చెప్పారు.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఆస్ట్రోనాటికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన కార్యక్రమంలో ఇస్రో ఛైర్మన్‌ పాల్గొన్నారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ''చంద్రయాన్‌-3 (Chandrayaan 3) విజయవంతమైంది. దాన్నుంచి డేటాను సేకరించి శాస్త్రీయ అధ్యయనం చేస్తున్నాం.

ఇక, జాబిల్లిపై భారతీయుడు అడుగుపెట్టేంతవరకు చంద్రయాన్‌ సిరీస్‌లను కొనసాగించాలని అనుకుంటున్నాం. అంతకంటే ముందు ఇంకా చాలా సాంకేతికతలపై పట్టు సాధించాలి. అక్కడికి వెళ్లి తిరిగి రావడంపై పరిశోధనలు చేయాలి. తదుపరి మిషన్‌లో దీన్ని ప్రయత్నిస్తాం'' అని వెల్లడించారు..

భారత్‌ త్వరలో చేపట్టబోయే గగన్‌యాన్‌ గురించి సోమనాథ్‌ మాట్లాడారు. ''దీనికంటే ముందు ఈ ఏడాది ఓ మానవరహిత మిషన్‌ను చేపట్టనున్నాం. ఏప్రిల్‌ 24న ఎయిర్‌డ్రాప్‌ వ్యవస్థను పరీక్షించనున్నాం. ఆ తర్వాత వచ్చే ఏడాది మరో రెండు మానవరహిత యాత్రలను చేపట్టబోతున్నాం. అన్నీ అనుకూలిస్తే 2025 చివరికి గగన్‌యాన్‌ ప్రయోగం చేపడతాం'' అని పేర్కొన్నారు..

గగన్‌యాన్‌ మిషన్‌ కోసం ఇప్పటికే నలుగురు వ్యోమగాములను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ ప్రాజెక్టులో ఇస్రో కీలక ముందడుగు వేసింది. మనుషులను సురక్షితంగా తీసుకెళ్లడానికి అనువైన CE20 క్రయోజనిక్‌ ఇంజిన్‌ను సిద్ధం చేసింది. ఈ ప్రయోగంతో వ్యోమగాములను 400 కిలోమీటర్ల ఎత్తులో భూకక్ష్యలోకి పంపుతారు. ఇందుకోసం ఎల్‌వీఎం-మార్క్‌3 రాకెట్‌ను ఉపయోగించనున్నారు. దాదాపు 3 రోజుల తర్వాత భూమికి తిరిగొస్తారు. తిరుగు ప్రయాణంలో వ్యోమనౌక సముద్ర జలాల్లో ల్యాండ్‌ అవుతుంది..

నిజంనిప్పులాంటిది

Apr 18 2024, 07:14

మాదాపూర్‌లో డ్రగ్స్‌ విక్రయిస్తున్న ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు అరెస్టు

హైదరాబాద్‌: మాదాపూర్‌లో డ్రగ్స్‌ విక్రయిస్తున్న ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులను ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు.

ఏపీలోని రాజమహేంద్రవరానికి చెందిన గుత్తులు శ్యామ్‌బాబు, కాటూరి సూర్యకుమార్‌లను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.4.2 లక్షల విలువ చేసే 28 గ్రాముల ఎండీఎంఏ, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు..

బెంగళూరులోని కీలక నిందితుడు సోల్‌మెన్‌ నుంచి వీరు డ్రగ్స్‌ తీసుకొచ్చి.. రాజమహేంద్రవరంలో విద్యార్థులకు అధిక ధరకు విక్రయిస్తున్నట్టు దర్యాప్తులో తేలింది.

నిందితులిద్దరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కుమారులని పోలీసులు తెలిపారు. ఉన్నత చదువులకోసం బెంగళూరుకి వెళ్లి డ్రగ్స్‌ దందాలో దిగారని పేర్కొన్నారు. దర్యాప్తు నిమిత్తం డ్రగ్స్‌తో సహా నిందితులను మాదాపూర్‌ పోలీసులకు అప్పగించినట్టు చెప్పారు..

Streetbuzz News

నిజంనిప్పులాంటిది

Apr 18 2024, 07:03

నేటి నుండి నామినేషన్ పర్వం ప్రారంభం

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు గురువారం ఏప్రిల్ 18 నోటిఫికేషన్ వెలువడనుంది.

రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థా నాలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడనుంది. లోక్‌సభ ఎన్నికల్లో కీలకమైన గెజిట్ నోటిఫికేషన్ గురువారం ఉదయం విడుదల కానుం డగా.. అదే రోజు నుంచే నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం కానుంది.

నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఈ నెల 25గా నిర్ణయించా రు. ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన, 29 ఉపసంహరణ గడువు ఉంటుంది. మే 13న పోలింగ్ జరగనుండగా, జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి.

లోక్‌సభ ఎన్నికలలో తెలం గాణ, ఆంధ్రప్రదేశ్ సహా 10 రాష్ట్రాల్లో 96 ఎంపీ స్థానాల కు నాలుగో విడతలో ఎన్ని కలు జరగనున్నాయి. సర్వేలు బంద్ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుండడంతో అన్ని రకాల సర్వేలకు పుల్‌స్టాప్ పడనుంది.

ఏ సంస్థ, ఏ వ్యక్తి.. ఎన్నిక లకు సంబంధించి ఎలాంటి సర్వేలు వెల్లడించకూడదు. ప్రీ -పోల్ సర్వే కానీ, ఒపీని యన్ పోల్ సర్వే కానీ, అంశాల వారీ సర్వే కానీ.. ఎలాంటి సర్వే వెల్లడించ కూడదు. జూన్ 1న మాత్రం ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించ డానికి ఎన్నికల సంఘం అనుమతించింది.

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్..

ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ

ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు తుది గడువు

ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన..

ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు..

మే 13న ఎన్నికలు..

జూన్ 4న ఓట్ల లెక్కింపు..

తెలంగాణలో 17 పార్ల మెంటు నియోజకవర్గాలు, ఒక అసెంబ్లీ నియోజక వర్గం

సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి మే 13న ఉప ఎన్నిక.. జూన్ 4న ఓట్ల లెక్కింపు..